ఉదయ్ శంకర్ నూతన చిత్రం ప్రారంభం

Published On: February 11, 2022   |   Posted By:

ఉదయ్ శంకర్ నూతన చిత్రం ప్రారంభం

కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఉదయ్ శంకర్ హీరోగా, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్  శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభమైంది.

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ క్లాప్ ఇచ్చి టీం కి శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ సర్ కెమెరా స్విచ్ఛాన్ చేసి టీం కి ఆశిస్సులు అందించారు. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు
తెలిపారు.  కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న  ఈ మూవీ లో మధునందన్,పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు.

యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ  ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించబోతుంది అని చిత్ర యూనిట్ అంటుంది. ఇది మా కథ వంటి ఒక యునిక్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఆకట్టుకున్న  దర్శకుడు గురు పవన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ  షూటింగ్ ఈ నెల 25 నుండి వైజాగ్ లో ప్రారంభం అవుతుంది.

మొదటి షెడ్యూల్ వైజాగ్ లో 20 డేస్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. నిన్న(10.02.2022)
హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందిచారు దర్శకులు వి.వి.వినాయక్. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో  రూపొందించబోతున్నామని దర్శకులు గురు పవన్ తెలిపారు.శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై  అట్లూరి నారాయణరావు ఈ సినిమాను
నిర్మిస్తున్నారు.

నటీ నటులు:
ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,  మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్
అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సాంకేతక వర్గం:
డి.ఓ.పి. : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్
సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్
మున్ద్రు,  నిర్మాత: అట్లూరి నారాయణరావు, దర్శకుడు: గురు పవన్.