ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం

Published On: December 2, 2019   |   Posted By:
ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం


సినిమా మల్టీప్లెక్స్ లలో ఎసియన్ బ్రాండ్ నలుదిశలా వ్యాప్తిస్తుంది.  హైదరాబాద్ లో పదో మల్టీ ప్లెక్స్ ను నారపల్లి లో మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి , నిర్మాత శిరీష్ , ఎమ్యల్యే భేతి సుభాష్రెడ్డి లు    ప్రారంభించారు.
 
రాజకీయ,సినీ ప్రముఖలతో ఎసియన్ ముక్తా సినిమాస్ ఎ2 ప్రారంభం గ్రాండ్ గా జరిగింది. మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా మల్టీప్లెక్స్ లను అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎసియన్ గ్రూప్ కే దక్కుతుంది.

వేగంగా విస్తరిస్తున్న జంట నగరాలలో ఎసియన్ మల్టీ ప్లెక్స్ లు సాధారణ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో  అందరికీ అందుబాటులో ఉండే విధంగా మల్టీ ప్లెక్స్ లను డిజైన్ చేయడంలో ఎసియన్ గ్రూప్ సక్సెస్ అయ్యింది.  అందుకే అనతి కాలంలో పది మల్టీ ప్లెక్స్ లను నిర్మించగలిగింది. ఈ కార్య క్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి , ఎమ్యల్యే భేతి సుభాష్ రెడ్డి లతో పాటు నిర్మాతలు శిరీష్ , గోవర్దన్ లు, ఎసియన్ సినిమాస్ అధినేత్ సునీల్ దాస్ నారాంగ్, ఎసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణ దాస్ కె.నారంగ్ ,  డిస్ట్రిబ్యూటర్ సదానంద్ గౌడ్, శ్రీధర్ , కాంప్లెక్స్ యజమాని జనార్ధన్ లతో పాటు పలువురు ప్రముఖలు  హాజరయ్యారు.
 
 
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ:
‘‘ ఈ  కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. ఆ వినోదాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్న ఎసియన్ సంస్థకు నా శుభాకాంక్షలు’’ అన్నారు.
 
 మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ:
‘‘ మల్టీ ప్లెక్స్ లంటే సామాన్యులకు భారంగా ఉండే పరిస్థితి  ఉంది.  ఎసియన్ గ్రూప్  సామాన్యలకు  అందుబాటులో వినోదం ఉంచడం చాలా సంతోషంగా ఉంది.  క్వాలిటీ మూవీ చూడాలంటే చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పని లేకుండా అన్ని చోట్లా ఎసియన్ మల్టీ ప్లెక్స్ లను నిర్మించడం చాలా సంతోషంగా ఉంది.  ఈ స్క్రీన్ ఓపెనింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది ’’ అన్నారు. 
 
ఎసియన్ గ్రాప్ ఛైర్మన్ నారాయన్ దాస్ కె నారంగ్  మాట్లాడుతూ:
‘‘ ఎసియన్ జంటనగరాల్లో నిర్మించిన పదో మల్టీ ప్లెక్స్ ఇది. నగరం వేగంగా అభివృద్ది చెందుతుంది.  అందుకే మల్టీ ప్లెక్స్ లను అందరికీ అందుబాటులో ఉండేవిధంగా నిర్మిస్తున్నాము. ఎ మల్టీ ప్లెక్స్ లేని విధంగా ఎసియన్  మల్టీ ప్లెక్స్ సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మిడిల్ క్లాస్ వారికి సామాన్యులకు అందుబాటులో ఉండే వినోదం. హైదారాబాద్ తో పాటు కర్నాటక, ఆంధ్రాలలో కూడా ఎసియన్ మల్టీ ప్లెక్స్ లను వచ్చే యేడాది నిర్మిస్తాము. నారా పల్లి లో ఎసియన్ మల్టీ ప్లెక్స్  నిర్మించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.