ఎస్‌.కె చిత్రం ప్రారంభం

Published On: July 15, 2021   |   Posted By:

ఎస్‌.కె చిత్రం ప్రారంభం

కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎస్‌.కె’ చిత్రం ప్రారంభం

భారతి క్రియేషన్స్‌, కథెరిన్‌ ఫిల్మ్‌ వర్క్స్‌, మౌనిక ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్‌కె’ గురువారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ నిర్మాత. సీనియర్‌ నటుడు పృథ్వీ(30 ఇయర్స్‌ ఇండస్ర్టీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి చిత్రీకరించారు. దర్శకుడు చిరంజీవి కుమార్తె క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ దర్శకుడికి స్ర్కిప్ట్‌ అందించారు. 
 
హీరో, దర్శకుడు,చిరంజీవి కుంచల్‌ మాట్లాడుతూ ‘‘అన్ని కమర్షియల్‌ హంగుతో కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ ‘జీఎఫ్‌’ విడుదలకు సిద్థంగా ఉండగానే మరో సినిమా రప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 
 
నిర్మాత సర్దార్‌ సుర్జీత్‌ సింగ్‌ మాట్లాడుతూ… 30 రోజులపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు’’ అని చెప్పారు. 
 
హీరోయిన్‌ శ్రీలు మాట్లాడుతూ ‘‘కథ వినగానే అంగీకరించా. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందంగా ఉంది. సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే ప్రధాన బలం’’ అన్నారు. 
 
గడ్డం నవీన్‌, అభిరామ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  కెమెరా: వలి, మ్యూజిక్‌ :శ్రీ వెంకట్‌