క్షీర సాగర మథనం టీజర్ కు లక్ష వీక్షణలు

Published On: August 31, 2020   |   Posted By:
క్షీర సాగర మథనం టీజర్ కు వీక్షణలు
 
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలు. అక్షత సోనావని హీరోయిన్. ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు.  
 
 ప్రముఖ దర్శకులు క్రిష్ విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ను లక్ష మంది వీక్షించడం విశేషం. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. 
‘క్షీర సాగర మథనం’ చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు”క్షీర సాగర మథనం” టీజర్ ను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ టీజర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకులు క్రిష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.
 
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!