ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఆదిపురుష్ మూవీ 100 ఉచిత టిక్కెట్లు

Published On: June 12, 2023   |   Posted By:

ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఆదిపురుష్ మూవీ 100 ఉచిత టిక్కెట్లు

ఆదిపురుష్ సినిమా కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రేయస్ మీడియా ఖమ్మం జిల్లాలో ప్రతి రామాయలానికి 100 టిక్కెట్లు

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ నటించిన ఆది పురుష్. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఘనంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమా మేకర్స్ మరియు దర్శకుడు కలిసి ఈమధ్య ఒక సరికొత్త సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేమిటి అంటే రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం,ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి ధియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతోంది అంటూ తమ ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేశారు ఈ సినిమా యూనిట్.

అయితే ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సాహిస్తూ మన టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ మరియు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో చాలా ఫేమస్ అయిన  శ్రేయస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే శ్రేయస్ మీడియా వారు ఉచితంగా  ఖమ్మం జిల్లాలోని, ప్రతి గ్రామంలోని  ప్రతి రామాలయానికి 100+1 1 టికెట్ హనుమాన్ కి టికెట్లు ఉచితంగా ఇవ్వదలుచుకున్నారు. శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ తన సొంత డబ్బులతో ఈ టికెట్ లు కొని ఇస్తున్నారు. దేశంలోనే నెం.1 మూవీ ఈవెంట్ ప్రొమోషన్ కంపెనీ అయిన శ్రేయాస్ కంపెనీ ఇంత మంచి ఆలోచన తో రావడం అందరినీ ఆనందింప చేస్తోంది.

ఆయా ఆలయాల నుండి ఎవరైనా ఒకరు కింద తెలియజేసిన ఫోన్ నెంబర్ ను సంప్రదించడం ద్వారా టిక్కెట్లను పొందవచ్చు. 8466012345

శ్రీరాముడు, సీతామాత గాథ అందరికీ ఆదర్శం.ఆ దివ్యమైన చరిత్రే ఆదిపురుష్ సినిమా. ఆ ఆదర్శవంతమైన దివ్య మంగళ చరిత్ర ప్రతి ఒక్కరికీ చేరాలనే సంకల్పంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నాము అని శ్రేయస్ మీడియా వారు ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇక ఇలాంటి సినిమాని ప్రోత్సహిస్తూ శ్రేయస్ మీడియా చేసిన పనికి సినీ ప్రేక్షకులు ఎంతగానో అభినందిస్తున్నారు.

టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకొస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.