టైగర్ నాగేశ్వరరావు మూవీ పాట విడుదల

Published On: September 5, 2023   |   Posted By:

టైగర్ నాగేశ్వరరావు మూవీ పాట విడుదల

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు నుండి ది పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఏక్ దమ్ ఏక్ దమ్ పాట 5 భాషల్లో విడుదల

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు భారతదేశంలోని అతిపెద్ద దొంగ ఇన్ ఫేమస్ యాక్ట్స్ గురించి మాత్రమే కాదు అతని జీవితంలోని ఇతర కోణాలను ప్రజెంట్ చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ప్రేయసి సారా పాత్రలో నుపుర్ సనన్ లుక్ ను ఇది వరకే మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ సింగల్ ని సౌత్ ఇండియా భాషలు, హిందీలో విడుదల చేయడం ద్వారా సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లను గ్రాండ్ గా ప్రారంభించారు.

ఏక్ దమ్ ఏక్ దమ్ పాట పెప్పీయెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవనుంది. ప్రేక్షకులు, మ్యూజిక్ లవర్స్ పల్స్‌ తెలిసిన కంపోజర్స్ లో జివి ప్రకాష్ కుమార్ ఒకరు. ఏక్ దమ్ ఏక్ దమ్ పాటలో డ్యాన్స్ రిథమ్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి. జివి తన ఇన్‌స్ట్రుమెంటేషన్, కంపోజిషన్ తో పాటకు రెట్రో అనుభూతిని తెచ్చారు. భాస్కరభట్ల సాహిత్యం నేటివిటీని జోడించగా, అనురాగ్ కులకర్ణి అద్భుతంగా అలపించారు.

కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే ఎలక్ట్రిఫైయింగ్, ట్రెండీ హుక్ స్టెప్‌ను క్రియేట్ చేశారు. రవితేజ యంగ్ గా కనిపించారు. రవితేజ డ్యాన్స్ యూత్, మాస్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. కాస్ట్యూమ్స్, సెట్లు కూడా రెట్రో అనుభూతిని పెంచుతాయి. ఈ పాటకు ఇన్స్టంట్ రెస్పాన్స్ వస్తోంది. రాబోయే రోజుల్లో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

తారాగణం: 

రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ