పాపం పసివాడు వెబ్ సిరీస్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్

Published On: September 25, 2023   |   Posted By:

పాపం పసివాడు వెబ్ సిరీస్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్

ఆహా ఒరిజినల్ సిరీస్ పాపం పసివాడు ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

సెప్టెంబర్ 23, హైదరాబాద్ పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి పాపం పసివాడుఅనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను వీకెండ్ షో రూపొందించింది. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తే ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రాజ్ రిలీజ్ చేశారు. ఈ ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఫన్ రైడర్ సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

పాపం పసివాడుసిరీస్‌లో టాలెంటెడ్ సింగర్ శ్రీరామ చంద్రతో పాటు గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో మన కథానాయకుడు శ్రీరామ చంద్ర పాతికేళ్ల క్రాంతి అనే కుర్రాడి పాత్రలో అలరించబోతున్నారు. అతను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. అతని హృదయం ప్రేమ కారణంగా బద్దలై ఉంటుంది. అలాంటి తరుణంలో అతన్ని ఒకరు ఇద్దరు కాదుఏకంగా ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, పాపం పసివాడు ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ కావటం ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రేమ, కామెడీ కాంబోలో సాగే ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ రోలర్ కోస్టర్‌లా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ సిరీస్ ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఎంటైర్ టీమ్‌కి అభినందనలు, అన్నారు.

ప్లే బ్యాక్ సింగర్‌గా శ్రీరామ చంద్ర తన వైవిధ్యాన్ని ఎప్పుడో చాటుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా ఆహాలో రూపొందిన పాపం పసివాడుసిరీస్ గురించి మాట్లాడుతూ, ఆహాతో నేను కలిసి పని చేయటం ఇది మూడోసారి. యాంకర్‌గా ఇక్కడ నా జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు పాపం పసివాడు సిరీస్‌తో యాక్టర్‌గా మారాను. ఇది ఓ వైపు ప్రేమ మరో వైపు కామెడీ కలయికతో సాగే ఒరిజినల్. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేశాను. సెప్టెంబర్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు, అన్నారు

సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో పాపం పసివాడు సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే భావోద్వేగాలు, ఎంటైర్‌టైన్‌మెంట్ ఇందులో మిళితమై ఉంటాయి.