ప్రశాంత్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ

Published On: May 13, 2020   |   Posted By:
ప్రశాంత్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ
 
ప్రజా నాట్య మండలి కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన “ప్రశాంత్ గౌడ్”.
 
కరోనా మహమ్మరి విలయతాండవంలో కొట్టుకు పోతున్న పేద బ్రతుకుల పాలిట  కల్పతరువుల మారారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ,సార్ధక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్.
 
 
ఇటీవలే ఆయన ప్రజానాట్యమండలి కళాకారులకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” దర్శకుడు బాబ్జి సూచన మేరకు  ప్రజా నాట్య మండలి కళాకారులకు బియ్యం ,నిత్యావసర సరుకులు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు సమాజాన్ని చైతన్య పరుస్తూ , ప్రజల కోసం పనిచేసే కళాకారులు ఆకలిబాదతో అలమ టిస్తుండటం  భావ్యం కాదని భావించి  వారికి ఈ  నిత్యవసర సరుకులు పంపిణీ చేసాం. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో  నిర్మాత వి.వి.ఏస్. వర్మ, తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పల్లె, నర్సింహ,రాష్ట్ర నాయకులు ఆందోజు రవీంద్రా చారి, డి.వేణుగోపాలచారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.