మొక్కలు నాటిన యువ నటుడు నవదీప్

Published On: August 13, 2020   |   Posted By:
మొక్కలు నాటిన యువ నటుడు నవదీప్
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటుడు నవదీప్
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  నటుడు అలీ రేజా విసిరిన  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన స్వగృహం జూబిలీ హిల్స్లో మొక్కలు నాటిన యువ నటుడు నవదీప్.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.