యష్ కెరీర్‌కి ప‌న్నెండేళ్ళు

Published On: July 18, 2020   |   Posted By:
యష్ కెరీర్‌కి ప‌న్నెండేళ్ళు
 
ఈ ప్రత్యేకమైన రోజు ని  ఎప్పటి కి  మర్చిపోలేను : యష్
 
(యష్ కెరీర్‌కి ప‌న్నెండేళ్ళు సందర్భంగా)
 
కెజిఎఫ్ – చాప్ట‌ర్‌1 సినిమాతో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న క‌న్న‌డ హీరో య‌శ్ తొలి చిత్రం  మొగ్గిన మ‌న‌సు విడుద‌ల‌యి ఈ జులై 18కి ప‌న్నెండేళ్ళు పూర్త‌యింది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రో విశేషం ఏమిటంటే – య‌శ్ శ్రీమ‌తి రాధికా పండిట్ కూడా ఈ సినిమాతోనే ప‌రిచ‌య‌మ‌య్యారు.
2008లో విడుద‌ల‌యిన మొగ్గిన మ‌న‌సు సినిమా రొమాంటిక్ డ్రామా. య‌శ్‌, రాధికా పండిట్ క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌శాంక్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కావ‌డంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది.
ఆ త‌ర్వాత య‌శ్ మొద‌ల సాల‌, రాజ‌ధాని, కిరాత‌క‌, డ్రామా, గ‌జ‌కేస‌రి, గూగ్లీ, రాజాహులి సినిమాల‌తో పాపుల‌ర్ అయ్యారు. మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ సినిమాలో కూడా రాధికా పండిట్ హీరోయిన్ కావ‌డం విశేషం. ఆ త‌ర్వాత కెజిఎఫ్ చాప్ట‌ర్‌1 సినిమాతో ఆలిండియా స్టార్ అయ్యారు. కెజిఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
మొగ్గిన మ‌న‌సు  సినిమా లో  యష్  శ్రీ మతి   రాధికా పండిట్  హీరోయిన్ గా  నటించారు . ఇదే  రాధికా పండిట్  తోలి  సినిమా . ఆ  తర్వాత వీరిద్దరి  పరిచయం  ప్రేమ గా మారి  పెళ్లి చేసుకున్నారు . 
ఈ సందర్భంగా యష్  మాట్లాడుతూ ” ఈ   ప్రత్యేకమైన రోజు ని  ఎప్పటి కి  మర్చిపోలేనని . ఒక  స్క్రాప్ నుంచి తారాస్థాయికి  వచ్చానని   యష్  అన్నారు. అలాగే  కెజిఎఫ్ చాప్టర్ -2 షూటింగ్   కొంత   బ్యాలెన్స్ వర్క్ వుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.