రాజ్‌త‌రుణ్ హీరోగా చిత్రం ప్రారంభం

Published On: November 3, 2020   |   Posted By:
రాజ్‌త‌రుణ్ హీరోగా చిత్రం ప్రారంభం
 
రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం
 
యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది.
 
ఈ సంద‌ర్భంగా…
 
నిర్మాత‌లు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి మాట్లాడుతూ –
 
“రాజ్‌త‌రుణ్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శాంటో చెప్పిన క‌థ న‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు. 
 
ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ – “రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. ఆయ‌న్ని కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకునే ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా ఉంటుంది. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ‌తాం“ అన్నారు. 
 
 
న‌టీన‌టులు:
 
రాజ్‌త‌రుణ్‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శాంటో
నిర్మాత‌లు: నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి
సంగీతం:  స్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ: శ‌్రీరాజ్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్ డిజైన్‌:  అర్చ‌నా రావ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ఉద‌య్‌, ర‌వీన‌
ఎడిట‌ర్‌:  శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని