వాయిదా ప‌డ్డ ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Published On: August 24, 2019   |   Posted By:
 
వాయిదా ప‌డ్డ ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌


విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఈ నెల 25(ఆదివారం)న ఆవిష్క‌రించేందుకు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. 
 
అయితే ఈ ఆవిష్క‌ర‌ణ కార‌ణాంత‌రాన వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్రభుత్వం నుండి  అనుమ‌తులు ఇంకా మంజూరు కాలేదు. 
 
త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.