శ్రీకాంత్ భోజనా కార్యక్రమం

Published On: April 16, 2020   |   Posted By:
శ్రీకాంత్ భోజనా కార్యక్రమం
 
హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడ లోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు  భారీగా పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం అక్కడ జరిగింది.
 
ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటుగా శ్రీ మిత్ర చౌదరి,  డీసీపీ ట్రాఫిక్, చౌహన్  మరియు పలుగురు పోలీస్ సిబ్బందులతో కలసి యూసుఫ్ గూడ కృష్ణ కాంత్ పార్క్ ముందు ఫుడ్ ప్యాకెట్స్ ను అందచేశారు .
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కారోన మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పర్మిషన్ తో వారి ఆధ్వర్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  పోలీసుల సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. లాక్ డౌన్ ఉన్నంతకాలం నాకు చేతనైనంత వరకు నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను. అందరూ ఇంట్లో ఉండి కారోన మహమ్మారి  ని తరిమికొట్టాలి అని పిలునిచ్చారు హీరో శ్రీకాంత్.