శరత్ మరార్ కామెడీ వెబ్ సిరీస్ అసలేం జరిగిదంటే
Published On: April 15, 2020 | Posted By: ivs
శరత్ మరార్ కామెడీ వెబ్ సిరీస్ అసలేం జరిగిదంటే
నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన కామెడీ వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిదంటే’
నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘అసలేం జరిగిందంటే’ . చందూ అల్లాడ దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్లో వైవా హర్ష, యష్న చౌదరి నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎం.ఎక్స్ ప్లేయర్లో వీక్షించవచ్చు. లాక్డౌన్ సమయంలో చందు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. గతం మరిచిపోయిన గయ్యాలి భార్యను భర్త(వైవా హర్ష) తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? అనేదే కథాంశం