సర్కారు వారి పాట మూవీ 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్

Published On: January 30, 2021   |   Posted By:

సర్కారు వారి పాట మూవీ 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్  చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో ప్రారంభ‌మైన విష‌యంతెలిసిందే.

గ‌తంలో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చిత్రాలు `ఒక్క‌డు` ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలి‌చింది, అలాగే `బిజినెస్‌మేన్` సెన్సేష‌న‌ల్  హిట్ట‌య్యింది, `స‌రిలేరు నీకెవ్వ‌రు` సెన్సేష‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇలా సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి మంచి విజ‌యాలున్నాయి.

ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఎంతో ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని కూడా 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ – “ 2022 సంక్రాంతి పండ‌గ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట`తో ప్రారంభం“ అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.