కళ్యాణం కమనీయం చిత్రం నుంచి ఓ మనసా లిరికల్ సాంగ్ రిలీజ్

Published On: December 15, 2022   |   Posted By:

కళ్యాణం కమనీయం చిత్రం నుంచి ఓ మనసా లిరికల్ సాంగ్ రిలీజ్

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా కళ్యాణం కమనీయం. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి ఓ మనసా అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసి పాడారు. ఓ యువ జంట పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి
పెళ్లయ్యే దాకా సాగే సందర్భాలన్నీ ఈ పాటలో అందంగా చూపించారు. నా కథలే మలుపే తిరిగే, నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే .నీ కలలే పెరిగే అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్ తో సాగుతుందీ పాట.

ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.