యేవ‌మ్ చిత్రం నుంచి ర్యాప్ సాంగ్ విడుద‌ల

రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం యేవమ్‌ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి..ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్‌భాస్క‌ర్ విడుదల చేశారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ
మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా వుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.

నటీనటులు :

చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫర్‌ :  ఎస్‌వీ విశ్వేశ్వర్‌
సంగీతం : కీర్తన శేషు, నీలేష్‌ మందలపు
ఎడిటర్‌ : సుజనా అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : రాజు పెన్మెత్స