కొంచం చూసి ప్రేమించు డూడ్ మూవీ ఫస్టు లుక్ రిలీజ్

వేద ఎంటర్ప్రిజ్స్ పతాకం పై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణం లో గౌతం మన్నవ దర్శకత్వ సారథ్యం లో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కే సీ పీ డి ( కొంచం చూసి ప్రేమించు డూడ్) .

వాలెంటైన్స్ డే శుభ సందర్భం గా చిత్ర యూనిట్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేస్తూ సినిమా మార్చ్ లో షూటింగ్ మొదలుకొని సమ్మర్ కి విడుదలకి సిద్ధం అవుతుందని వెల్లడించారు. ప్రజెంట్ జనరేషన్ లో యువత మనస్తత్వం , వారి ఆలోచనల ధోరణి నేపథ్యం లో రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కబోతుంది అని తెలిపారు.

తారాగణం :

తనీష్ అల్లాడి, శ్రీరామ్ రెడ్డి , ద్వారక వి డి ఎన్ (బంటి) , సుభశ్రీ రాయగురు, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్.

సాంకేతికవర్గం :

రచన : బంకుపల్లి నాగ భరద్వాజ్, లింగాచారీ
సినిమాటోగ్రఫీ : శ్రీకరబాబు
కథనం & దర్శకత్వం : గౌతం మన్నవ