తెలిసినవాళ్ళు చిత్రం ఎనభై శాతం పూర్తి

Published On: March 9, 2021   |   Posted By:

తెలిసినవాళ్ళు చిత్రం ఎనభై శాతం పూర్తి

సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” తెలిసినవాళ్ళు” .  

విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన అంటే ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ పాత్రలో హీబా పటేల్ తన సినీ కెరీయర్ లో ఒక కొత్త కోణాన్ని  ఆవిష్కరించ బోతున్నారు.   

ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్,  పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ఉండగా ఇతర ముఖ్య పాత్రలలో యువ నటులు , టెక్నీషియన్స్ గా ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్లు కలిగిన ఈ చిత్రం అత్యున్నత ప్రామాణాలతో దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది.  ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

తెలిసినవాళ్ళు
నిర్మాత : సిరెంజ్ సినిమా
సమర్పణ  : కేఎస్వీ ఫిలిమ్స్
కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం  : విప్లవ్ కోనేటి
చాయాగ్రహణం : అజయ్ వి నాగ్
కూర్పు : ధర్మేంద్ర కాకరాల
సంగీతం : దీపక్ వేణుగోపాలన్
సాహిత్యం: డాక్టర్ జివాగో
కళ : ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ : జావేద్ మాస్టర్ , శైలజ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామ కృష్ణ