జాతి రత్నాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
 
మార్చి 11న జాతి రత్నాలు చూసి ఎంజాయ్ చేయండి – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజ‌య్ దేవ‌రకొండ‌
 
నవీన్ పోలిశెట్టి – రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా ప‌రిచ‌య మ‌వుతున్నారు.  ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా జాతి ర‌త్నాలు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వ‌రంగ‌ల్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రై జాతిర‌త్నాలు బిగ్ టికెట్ ఆవిష్క‌రించారు.  ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌రై ఈవెంట్‌ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు. 
 
క్రేజీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ‘కాకతీయ వరంగల్.ఇక్కడున్న ప్రతీ ఒక్కరికీ, అక్కడున్న ప్రతీ ఒక్కరికీ, మీ అందరూ కనిపిస్తున్నారు. ఐ లవ్యూ ఆల్. ఈ రోజు మార్నింగ్ నాగీ నుంచి మెసెజ్ వచ్చింది. సినిమా పూర్తి అయింది నువ్ త్వరగా రావాలి అన్నాడు. ఇక్కడికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని అన్నాను ఇంత మందిని కలిసే అవకాశం వచ్చింది. ఏడాది నుంచి మీ అందరినీ చూడలేదు. ఈరోజు నేను నటుడిని కాలేకపోయినా ఇక్కడకి వచ్చేవాడిని. మీలా అక్కడ కూర్చుని చూసేవాడిని. యాక్టర్‌ని అయ్యాను కాబట్టి ఇక్కడ నిల్చున్నా. లాక్డౌన్ సమయంలో భయం వేసింది.ఈ ప్యాండమిక్‌లో మళ్లీ సినిమాలకు వస్తారా,చూస్తారా అని మేమంతా మాట్లాడుకున్నాం. మీరు మాకెంత ముఖ్యమో ఈరోజు తెలుస్తోంది. సినిమా అంటే ఒక ఎకానమీ. ఓ డైరెక్టర్ కథ రాస్తే, నిర్మాత ఓకే చేసి హీరో సైన్ చేస్తే యాక్టర్ స్టాఫ్ లైట్స్ మెన్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిషియన్స్ డ్రైవర్లు,  క్యాస్టూమ్ డిజైనర్లు ఇలా అందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నాం. బాంబేకి వెళ్లినా అక్కడి వారు మన గురించి మాట్లాడతారు. తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బా. ఏం సినిమాలు చూస్తారు. ఎంత ప్రేమిస్తారు అని అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. ఈవెంట్ అని చెబితే వేల మంది వస్తారు. మాకు గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు అని చెబుతాను. నేను మిడిల్ క్లాస్ ఫండ్ అంటే మీరే వచ్చి చేశారు. బర్త్ డే ట్రక్ ఐదు రాష్ట్రాల్లో చేద్దామంటే మీరు వచ్చి అన్ని రాష్ట్రాల్లో చేస్తామని అన్నారు.ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్లు ఇన్ని ప్యాన్ ఇండియా అనౌన్స్‌మెంట్లు.ఇంత క్రౌడ్ ఎక్కడైనా ఉంటుందా? తెలుగు వాళ్లను బీట్ చేసే ఆడియెన్స్. ఫ్యాన్స్ ఎక్కడా లేరు. కాలర్ ఎగరేసి చెబుతున్నా. ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించి ఇది చెప్పాలని అనుకున్నాను. ఇక్కడున్న వారంతా నా ఫ్రెండ్స్. నా జీవితంతో ఏదో ఒకలా ప్రతీ ఒక్కరూ ముడిపడి ఉన్నారు. కలిసి కలలు కన్నాం. కష్టాలు చెప్పుకున్నాం. నవ్వించారు. ధైర్యమిచ్చారు.వంద వంద వేసుకుని తిన్నాం తాగాం. దర్శిలేకపోతే పెళ్లి చూపుల్లో ప్రశాంత్ లేడురా.దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు.ప్రతీ రోజూ బిజీగా ఉంటున్నాడు. శివ లేకపోతే అర్జున్ లేడు. రాహుల్ రామకృష్ణను నటుడిగా నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆరేళ్ల క్రితం నువ్ హీరోగా నిలబడుతావ్. మన ముందు ఓ 25 వేల మంది ఉంటారు. మనం మాట్లాడతామని అనుకుంటే నవ్వుకునేవాళ్లం.కానీ ఇంటికెళ్లి ఇదే  కలలు కనేవాళ్లం. పడుకునే వాళ్లం కాదు. మేం అంతా కలిసి థియేటర్ చేసే వాళ్లం. నేను నవీన్ ఒక గ్రూపులో దర్శి, రాహుల్ మరో గ్రూపులో కలిసి నటించేవాళ్లు.ఆరేళ్ల క్రితం కూడా ఇదే టాలెంట్ ఉంది..టైం ఇప్పుడు వచ్చింది. ఇక్కడున్నాం. గుర్తుండిపోయే జర్నీ ఇస్తాం. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగ్ అశ్విన్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు.ఎవడే సుబ్రహ్మణ్యంలో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగీ. ఇలా ఉండు అలా ఉండు.. అందరిలా ఉండు అనే వాడు కాదు.. నీలా ఉండు అని చెప్పేవాడు.. ఫస్ట్ ప్రమోషన్స్‌కి వెళ్లేటప్పుడు గుర్తుండిపోయే మెమోరీ ఇవ్వమని నాగీ చెప్పాడు. ఇప్పటికీ అదే గుర్తు పెట్టుకున్నాం.. మధ్య మధ్యలో అనుదీప్ షార్ట్ ఫిలిమ్ చూపించి నవ్వించేవాడు.. ఫరియా ఎంతో ఎనర్జీతో నటించావ్.. నీ జర్నీ కూడా మాలానే మొదలైందని విన్నాను. మా అందరి కంటే మంచి నటిలా ఉన్నావ్.. మా మొదటి సినిమాలో నీ అంత యాక్టింగ్ చేయలేదు.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నన్ను నటుడిగా వైజయంతీ మూవీస్ లాంచ్ చేసింది.. ఇలా ఫ్రెండ్స్ అందరితో స్టేజ్ షేర్ చేసుకోవడం.. కన్న కలలన్నీ కూడా నిజం కావడం ఎంతో గొప్పగా ఉంది.  మార్చి 11న జాతి రత్నాలు. వెళ్లండి. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు
 
నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. హలో వరంగల్ థ్యాంక్యూ.. అందరూ కనిపిస్తున్నారు.. మాస్క్‌లు వేసుకుని అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఈ సినిమాను సంవత్సరం పాటు రిలీజ్ చేయకుండా ఉంచుకున్నాం.. ఇలాంటి ఫీలింగ్ కోసమే రెండేళ్లు మా దగ్గరే పెట్టుకున్నాం. ఇప్పుడు థ్యాంకింగ్ ప్రోగ్రాం పెట్టొద్దని అనుదీప్ అన్నాడు.రాహుల్, దర్శి, రధన్, ఫరియా. కొన్ని సినిమాలు అలా కలిసి వస్తాయ్. నవీన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలు చేసినా వాటికి తగ్గట్టు ఉంటాడు. ఏజెంట్ పాత్ర చేస్తే ఏజెంట్‌లా  జోగిపేట కుర్రాడిలా  ఇలా ఏ పాత్ర చేసినా అలానే కనిపిస్తాడు. విజయ్  కూడా అంతే..ఒకే నాణెనికి రెండు వైపులున్నట్టు ఉంటారు. ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్ విజయ్. ఏసీపీ జితేందర్ గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద ఈవెంట్‌ను జాగ్రత్తగా నిర్వహించినందుకు థ్యాంక్స్’ అని ఆయనకు శానిటైజ్డె బొకేను అందించారు. ఇక డైరెక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సినిమా కోసం పని చేసిన వారందరి గురించి నాగ్ అశ్విన్ వివరించారు.
 
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మొదలైన ప్రయాణం.ఈ జాతిరత్నాలు వరకు వచ్చింది. ప్రభాస్ అన్నతో డార్లింగ్ రత్నాలు అయ్యింది. ఇప్పుడు విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల ఫ్యామిలీలా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని.. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నాం. ఇది మీ సినిమా యూత్ సినిమా. పోస్టర్‌లో జాతి రత్నాలు అంటే మేం కనిపిస్తున్నాం. కానీ నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంక అసలు రత్నాలు.హీరో అవుదామని అనుకుని ఇక్కడికి వచ్చాం. కానీ ఎవరు కలవాలి. ఎవరి దగ్గరకు వెళ్లాలి. ఏ స్టూడియోల చుట్టూ తిరిగి ఎక్కడ కాంటాక్ట్ చేయాలి ఏమీ తెలియవు. మా అందరికీ ఓ ఫ్లాట్ ఫాం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్లందరికీ థ్యాంక్స్. అనుదీప్, రదన్, చిట్టీ సాంగ్‌ను ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి అందరికీ థ్యాంక్స్. మా జానే జిగర్.. విజయ్ నేను థియేటర్ వర్క్ షాప్‌లో పదేళ్ల క్రితం కలుసుకున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన మా విజయ్. ఆ జర్నీ నుంచి మా సినిమా ఫంక్షన్‌కు గెస్ట్‌గా రావడం నా లైఫ్‌లో చాలా మెమరబుల్ మూమెంట్.. ఈ సినిమా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. లాక్డౌన్‌లో ఓటీటీ నుంచి ఎన్ని డీల్స్ వచ్చినా కూడా భద్రంగా కాపాడారు. థియేటర్లో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటే చూడాలని ఎంతో భద్రంగా కాపాడారు. ఎన్ని కష్టాలున్నా ఓ ఐదు నిమిషాలు నవ్వుకుంటే లైఫ్ నేను అనుకున్నంత బ్యాడ్‌గా లేదేమో అనే ధైర్యాన్ని నవ్వు ఇస్తుంది. ఆ నవ్వును మీకు పంచేందుకు మార్చి 11న మేం వస్తున్నాం.జాతి రత్నాలు సినిమాతో ఎంజాయ్ చేద్దామ’ని అన్నారు.
 
దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. హాయ్ వరంగల్ అందరికీ నమస్కారం. మార్చి 11న సినిమా రిలీజ్. మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. నవీన్ టైంకు సెట్‌కు వచ్చేవాడు. ఫరియా బాగా నటించింది.. నాగ్ అశ్విన్ కథకు చెప్పిన తరువాత ఫుల్ చిల్లరగాళ్లుకావాలని చెప్పాను. ముందు నవీన్ పేరు చెప్పాను. తరువాత రాహుల్. దర్శి పేర్లు చెప్పాను. డీసెంట్ డైరెక్టర్ కావాలని నేను ఉన్నాను. నిర్మాతలు రెండూ మిక్స్ అయి ఉండాలి.మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ మాస్ కావాలని రధన్‌ను తీసుకున్నామ’ని సరదాగా నవ్వులు పూయించారు.
 
ప్రియదర్శి మాట్లాడుతూ.. ఇదొక హిస్టారిక్ మూమెంట్. చరిత్రలో నిలిచేపోయే ఘట్టం.. మేమంతా మీలాంటివాళ్లమే.. మాస్ గాళ్ల దగ్గరి నుంచి వచ్చినా మా లాంటి వాళ్లకు చాన్స్ ఇచ్చినందుకు వైజయంతికి, స్వప్నా మూవీస్‌కు థ్యాంక్స్.. మేమే వచ్చామంటే.. మీలోంచి ఇంకెంత మంది వస్తారు’ అని అన్నారు.
 
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. మా వాడు(ప్రియదర్శి) చెప్పినట్టు నేను అంత సోది చెప్పను. కానీ మీరంతా విజయ్ దేవరకొండ గురించి ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. అంతకు ముందు స్వ డబ్బా.పరస్పర డబ్బా కొట్టుకోకుండా ఓ పది ముచ్చట్లు చెబుతా.ఈ సినిమా చూస్తున్నంత సేపు కచ్చితంగా సీట్లు చింపుకుంటూ నవ్వుతూనే ఉంటారు.ఒక వేళ్ల నవ్వకుంటే మా ఇంటికి రండి. మళ్లీ నవ్విస్తాను’అని ముగించాడు. మళ్లీ ప్రియదర్శి అందుకుని ‘మాస్క్ పెట్టుకుని రండి. మిమ్మల్ని నవ్వించే బాధ్యత మాది’ అని అన్నారు. 
 
హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అయినా అలా అనిపించలేదు. టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. నాగ్ అశ్విన్, ప్రియాంక బాగా ఎంకరేజ్ చేశారు. సెట్లో ఫుల్ జోష్ తో షూటింగ్ చేశాం. పెద్ద బ్యానర్లో నా మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌రై ఈవెంట్‌ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు.