మొక్కలు నాటిన నటుడు నాగబాబు

Published On: September 7, 2020   |   Posted By:
మొక్కలు నాటిన నటుడు నాగబాబు
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లోని తన నివాసం లో మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు.
 
అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని నటుడు నాగబాబు అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. జబర్దస్త్ చమ్మక్ చంద్ర  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ  లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు.
 
అనంతరం మరో ఇద్దరు (  బుల్లితెర నటుడు భరణి , ఆర్టిస్ట్ కాళికి రాజు )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.