రోటి క‌ప‌డా రొమాన్స్ మూవీ టైటిల్ లోగో విడుదల

రోటి క‌ప‌డా రొమాన్స్ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే నమ్మ‌కం వుంది: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

రోటి క‌ప‌డా రొమాన్స్ టైటిల్ లోగోను ఆవిష్కరించిన దిల్ రాజు. రోటి కపడా రొమాన్స్ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టిన దిల్ రాజు. హుషారు, సినిమా చూపిస్తమావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ సృజన్‌ కుమార్ బొజ్జం తో కలిసి నిర్మించిన తాజా చిత్రం రోటి కపడా రొమాన్స్. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర కథ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీద్ధామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ గా వుంటుందని అడిగితే ఈ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా ఆ చిత్రాలను బాగా ఆదరించారు. మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో ఆల్ ఎమోషన్స్ వుంటాయి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం దిల్ రాజు గారికి కథ చెప్పాలని ఆయన ఆఫీస్ బయట తిరుగుతుండేవాడిని. ఇప్పుడు నా సినిమాకు ఆయనే టైటిల్ ఇచ్చి ఆయన చేతుల మీదుగా టైటిల్ ను ఆవిష్కరించడం నాకెంతో ప్రత్యేకమైనది. రోటి కపడా రొమాన్స్ ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆల్ ఎమోషన్స్ వుంటాయి. నేటి యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నిర్మాత వేణు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఆ కోవలోనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కథకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ సంతోష్ రెడ్డి, సంగీతం హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్ , వసంత్.జి, పాటలు క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్, ఎడిటర్ విజయ్ వర్థన్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, కొరియోగ్రఫీ జేడీ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్ నాగార్జున వడ్డె, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం, కథ స్కీన్ ప్లే మాటలు దర్శకత్వం విక్రమ్ రెడ్డి.