స్కై మూవీ పోస్టర్ విడుదల

అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే?

పృథ్వి పేరిచర్ల స్కై పోస్టర్ విడుదల

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం స్కై. అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం పోస్టర్ విడుదల చేశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తాలూకు తుది మెరుగులు దిద్దుకుటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండడం గమనార్హం!!

ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్టే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా స్కై చిత్రం కథాంశమని రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ స్కై చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు!!

తారాగణం :

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్

సాంకేతికవర్గం :

సంగీతం: శివ ప్రసాద్
ఎడిటర్: సురేష్ అర్స్
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల